Home » Kolkata
కోల్కతా అత్యాచారం, హత్య కేసులో విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడని కోల్కతా పోలీసులు గతంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నిందితుడు మాత్రం తనను ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నేడు CBI ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించనుంది.
జూనియర్ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ‘కావాలంటే నన్ను ఉరి తీసుకోండి’ (అమీ ఫాసీ దీయే దీ) అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పుడు మాటమార్చేశాడు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రొ. ఘోష్పై కేసు నమోదు చేయాలని కోల్కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తాను నిర్దోషినంటూ కోర్టులో భావోద్వేగానికి గురయ్యాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ శనివారంనాడు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్కు జైలులో పోలీగ్రాఫ్ టెస్ట్ జరపగా, సందీప్ ఘోష్, మరో నలుగురు డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించింది.
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే నిందితుడు సంజయ్ రాయ్ తల్లి తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇంకా ఏం చెప్పారనే వివరాలను ఇక్కడ చుద్దాం.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్ విభాగం సెమినార్హాల్లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా..
కోల్కతా మెడికల్ కళాశాలలో పీజీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పది రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు వారిని శుక్రవారం చర్చలకు ఆహ్వానించారు. జూడాలకు భద్రతకు చర్యలు తీసుకుంటామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సీనియర్ వైద్యులు డాక్టర్ భీమసేనాచారి, డాక్టర్ ...
కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 32 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యచారం ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్కి కఠిన శిక్ష విధించాలని అతడి తల్లి డమాండ్ చేశారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పెరగడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం జరిగినట్టు భావిస్తున్న ఆసుపత్రి సెమినార్ హాలు డోర్ బోల్డ్ విరిగిపోవడం తాజాగా సీబీఐ దృష్టికి వచ్చింది.