Home » Kolkata
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.
పశ్చిబెంగాల్ రాష్ట్రం బీర్భం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న నర్సుతో ఓ రోగి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.
కోల్కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నాయి.
కోల్కతా ఆర్జీకర్ వైద్య కాలేజీలో పీజీ వైద్యవిద్యార్థిని మృతిచెందిన విషయం ఆ ఘటనపై కేసు నమోదయ్యేంత వరకూ తనకు తెలియదని ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చెప్పారు.
బెంగాల్ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, ఒడిసా కూడా కాలిపోతాయని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా సమర్ధించారు. ఎంతో మెచ్యూరిటీతో మమత వ్యవహరించారని అన్నారు.
దేశవ్యాప్తంగా మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని భారత వైద్య మండలి(ఐఎంఏ) అధ్యయనంలో వెల్లడైంది.
కోల్కతా హత్యాచార ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేశారంటూ సీబీఐ చేసిన ఆరోపణలను కోల్కతా పోలీసులు తోసిపుచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి శుక్రవారం మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా అది ఉండాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కోల్కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో లేఖ రాశారు.
కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.