Home » Kodali Nani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సవాళ్ల పర్వం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీలో గెలిస్తే ఆయన కాళ్ల వద్ద పడి ఉంటానని వైసీపీ నేత కొడాలి నాని సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబు రికార్డు విజయంతో గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది.
కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, కాళ్ళ దగ్గిరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘వస్తే రాజ్యం... పొతే సైన్యం’ అన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడివాడలో గడ్డం గ్యాంగ్కు ప్రజలు జలక్ ఇచ్చారు. కొడాలి నాని (Kodali Nani) అనుచరులు ఆక్రమించుకున్న 7.66ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్లో రూ.100కోట్ల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నాని అనుచరులు ఆక్రమించుకున్నారు.
కరోనా సమయంలో మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) అండతో గడ్డం గ్యాంగ్ (Kodali Gaddam Gang) చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. దొరికిన చోటల్లా ..
తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని (Kodali Nani) అనలేదా అని ప్రశ్నించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మెన్లు సపర్యలు చేసి.. వైద్యులకు సమాచారం అందించారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్లు నడుస్తున్నాయి.