Home » Kodali Nani
వైసీపీ కీలక నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు.
Kodali Nani: ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్స్టేషన్లో, మరో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే.ఇప్పుడు కొడాలి నానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన సన్నిహితులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
‘తప్పు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే. ఈరోజు వల్లభనేని వంశీ, రేపు కొడాలి నాని. ఒకరి తర్వాత ఒకరు... అందరూ జైలుకు వెళతారు.
Andhrapradesh: కొడాలి నానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ కాళీ ప్రధాన పాత్ర పోషించాడు. అధికారంలో ఉండగా కొడాలి నాని అండను చూసుకుని కాళి పెట్రేగిపోయిన సందర్భాలు ఎన్నో. ఆయనపై అనేక కేసులు కూడా నమోదు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కాళీని అస్సాంలో పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు.. టీడీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా గుడివాడ వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)పై విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
‘పిచ్చి వాగుడు మానుకో.. నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే తరిమి తరిమి కొడతారు.’ ఇదీ మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన మాస్ వార్నింగ్. తాజా ప్రెస్మీట్లో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని విమర్శలు చేయడంపై ...