Home » KKR
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు శుభవార్త కలిగించే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణా బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
లఖ్నవూతో నిన్న జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సూపర్ ఓవర్లో కేకేఆర్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్లో లఖ్నవూ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫామ్లో లేని నికోలస్ పూరన్ను సూపర్ ఓవర్లో పంపించడం గమనార్హం. దీనిపై లఖ్నవూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వివరణ ఇచ్చాడు.
2024లో జట్టుకు ట్రోఫీని అందించిన అయ్యర్ను ఆ సీజన్ అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై కేకేఆర్ మాజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ తాజాగా స్పందించారు. అయ్యర్ను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందనే దానిపై మాట్లాడారు.
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సొంతగడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు అదరగొట్టారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లపై కేకేఆర్ బౌలర్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.