Home » kishan reddy
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఆదివారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర తూప్రాన్ చేరుకుంది. ఈ యాత్రలో కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్న నష్టం లేదని చెప్పారు.
Telangana: వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవని.. మోదీతోనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకులే వద్దంటున్నారన్నారు.
బుధవారం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో గోల్కొండలో లైట్ అండ్ ఇల్యూమినేషన్ షోని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి & సినీ నటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు.
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు మేనిఫెస్టో (Election Manifesto) అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రావాలన్నా.. ఉన్న అధికారం ఊడిపోవాలన్నా డిసైడ్ చేసేది మేనిఫెస్టోనే.!. అందుకే అధికారం కోసం పార్టీలు కొన్ని నెలలపాటు మేనిఫెస్టో కమిటీలు, అధినేత, అగ్ర నాయకులు కూర్చొని కసరత్తులు చేస్తారు..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి అనేక మంది కమలం పార్టీలో చేరుతుండగా.. తాజాగా ఆదిలాబాద్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవి కాషాయికండువా కప్పుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు ఆదివార వరంగల్కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.