Home » Khammam
ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
ఖమ్మం జిల్లాలో రైతు గరికపాటి వెంకట్రావు విదేశాల నుంచి తెచ్చిన మియాజాకీ మామిడి మొక్కలు ఇప్పుడు కిలోకు రూ.2.50 లక్షల ధరను చేరుకున్నాయి. ఈ ప్రత్యేక రకం మామిడి కోసం రైతు కుక్కలతో పంటను కాపలాగా పెట్టి రక్షిస్తున్నాడు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు ఇకపై ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవరంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్హెచ్ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
వంట గ్యాస్ సిలిండర్ లీకవడంతో ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
విద్యా వ్యవస్థలోని లోపాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వాటిపైనే కాక ప్రజా సమస్యలపై కూడా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎ్ఫఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ పిలుపునిచ్చారు.
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) వ్యవస్థాపకుడు రావెళ్ల రాఘవయ్య (91) కన్నుమూశారు. అనారోగ్యంతో విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తూ నయా ఫాసిస్టు విధానాలకు బీజం వేస్తోందని ఎస్ఎ్ఫఐ జాతీయ కార్యదర్శి వీపీ సాను విమర్శించారు.
ఖమ్మంలో మూడు మంత్రులు ఉన్నా, వారు అభివృద్ధి విషయంలో మౌనంగా ఉన్నారని కవిత ఆరోపించారు. అకాల వర్షాలతో రైతుల పంట నష్టంపై పరిహారం ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఖమ్మం నగరంలో 10 ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేసి, అవకతవకలు చేసినందుకు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు. సీఎం సహాయ నిధి దుర్వినియోగం ద్వారా నకిలీ బిల్లుల తయారీతో ఈ సంఘటన వెలుగు చూసింది.