Home » Khammam News
లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress party)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని ( Koneru Chini) కూడా గులాబీ పార్టీని వీడేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.
తమకు సరైన మర్యాద ఇవ్వలేదనో, భోజనం సమయంలో మాంసం వడ్డించలేదనో.. పెళ్లిళ్లలో ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా.. అబ్బాయి తరఫు వారి నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఫలితంగా.. అవి పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. సరదాగా జోకులేసినా..
ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్ఆర్ఎస్(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ..
బీఆర్ఎస్ (BRS) కు లోక్సభ ఎన్నికల ముందు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్న సమయంలో గులాబీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే కోవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కూడా గులాబీ పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.
Bhadradri: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను(Devotees) దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం(Free Darshan) అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారుల నిర్ణయం ప్రకారం.. భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి..
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.
తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) వెంట ఉండరని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. మణుగూరులో సోమవారం నాడు జరిగిన ప్రజా దీవెన సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(N.V.Ramana) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఖమ్మంలో ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్(Pradeep Singh Tagore) అన్నారు. విప్లవ పార్టీలు ఐక్యం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.