• Home » Khammam News

Khammam News

KTR: అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు

KTR: అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు

రాజకీయాల్లో విజయం, అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తూ కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాతీర్పుకు కట్టుబడి సుపరిపాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు.

Graduate MLC  Elections: కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్‌ను ఓడించాలి: కేటీఆర్

Graduate MLC Elections: కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్‌ను ఓడించాలి: కేటీఆర్

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.

Graduate MLC  Elections: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే.. రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతా: రాకేష్ రెడ్డి

Graduate MLC Elections: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే.. రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతా: రాకేష్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.

Diagnostics: డయాగ్నస్టిక్‌ హబ్‌లకు జబ్బు!

Diagnostics: డయాగ్నస్టిక్‌ హబ్‌లకు జబ్బు!

రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ హబ్‌లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో.. కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు.

Telangana : మండుతున్న పచ్చిమిర్చి ధరలు.. కిలో రూ.120

Telangana : మండుతున్న పచ్చిమిర్చి ధరలు.. కిలో రూ.120

పచ్చిమిర్చి ధరలు మండు తున్నాయి. వారం క్రితం వరకు కిలో రూ.50-రూ.60 పలికిన ధర ఇటీవల భారీగా పెరిగింది.

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు:  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.

Lok Sabha Election 2024: కేసీఆర్ మోసగాడు.. నన్ను జైల్లో పెట్టించాడు: మందకృష్ణ మాదిగ

Lok Sabha Election 2024: కేసీఆర్ మోసగాడు.. నన్ను జైల్లో పెట్టించాడు: మందకృష్ణ మాదిగ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్‌కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.

Telangana News: సున్తీ కోసం వస్తే పురుషాంగం కోసేశాడు.. ఎక్కడంటే..

Telangana News: సున్తీ కోసం వస్తే పురుషాంగం కోసేశాడు.. ఎక్కడంటే..

జిల్లా కేంద్రంలో(Khammam Centre) దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ(RMP) నిర్వాకం.. పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చింది. సున్తీ కోసం వెళితే.. ఏకంగా పురుషాంగానే కోసేశాడు సదరు స్పెషలిస్ట్ ఆర్ఎంపీ. ఈయనగారి నిర్వాకానికి..

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఉద్ఘాటించారు.

Lok Sabha Elections 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి కోనేరు బ్రదర్స్

Lok Sabha Elections 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి కోనేరు బ్రదర్స్

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని (Koneru Chinni) కూడా శనివారం నాడు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి