Home » Kesineni Chinni
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడితో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. రామ్మోహన్ నాయుడికి వినతిపత్రం అందజేశారు.
Andhrapradesh: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్సభలో రూల్ 377 కింద పొలవరం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్ట్ను తిరిగి ట్రాక్లోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం...
Andhrapradesh: నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... సమస్యలపై ఒకసారి మీ అందరితో మాట్లాడి తెలుసుకోవడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు.
విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(MP Kesineni Sivanath) వెల్లడించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు.
తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) తెలిపారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సీఎం చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు తెలిపారు. వైసీపీ ఆరాచక పాలనపై చేసిన న్యాయపోరాటంలో దమ్మాలపాటి కీలకపాత్ర పోషించారన్నారు. న్యాయశాస్త్రంపై మంచి పట్టువన్న న్యాయవాది ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ అని పేర్కొన్నారు.
విజయవాడ: మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బెజవాడ మొత్తం పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. వారధి, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి విజయవాడలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. వారధి వద్ద గుంటూరు వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా గుంటూరులోనే జాతీయ రహదారి పైకి వాహనాలను అనుమతించడం లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సునామీల దూసుకెళ్లింది. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి.. మిగిలిన స్థానాలన్నింటినీ కూటమి తన ఖాతాలో వేసుకుంది. చంద్రబాబు నివాసం వద్ద భద్రతను అధికారులు మరింత పెంచారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా కావడంతో నేషనల్ మీడియా సైతం చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.