Home » Kesineni Chinni
MP Kesineni: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందు వెళ్లారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
Home Minister Anitha: సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. కేంద్ర హోం శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.
Minister Nimmala Ramanaidu: గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మంత్రి నిమ్మల రామానాయడు విమర్శించారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్లు, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు.
Andhrapradesh: ‘‘మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ.. మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి’’ అని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని.. ఒకటి హైదరాబాద్, అమరావతి అని తెలిపారు.
ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి వరించింది. మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరతారనిమంత్రి నారాయణ అన్నారు. ‘నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా తయారు అయ్యాను’’ అని మంత్రి నారాయణ గుర్తుచేసుకున్నారు.
Andhrapradesh: ఎన్డీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు సమీక్షలో అనేక అంశాలపై చర్చించామని.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని పీహెచ్.సి సెంటర్లో అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గత ఐదేళ్లలో పోలీసులు వైసీపీ సైకోలను నియంత్రించలేక పోయారని లీడ్ క్యాప్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. పోలీసులు ఇకనైనా సైకో బ్యాచ్ చేస్తున్న అరాచకాల విషయంలో ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. వైసీపీ వికృత ఆకృత్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని అన్నారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇమాములు, ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు, హజ్ యాత్రకు రూ.లక్ష ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
అదృశ్యమైన 30 మంది మహిళలకు గుర్తించి.. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కేటాయింపును సైతం రద్దు చేసింది. ఈ తరహా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కో తట్టుకో లేకపోతుంది.