Home » Kanaka durga temple
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా అమ్మవారి వద్దకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
Andhrapradesh: డ్యూటీకి వచ్చిన ఆ పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఖాకీలు చేస్తున్న పనిని చూసి నెటిజన్లు ఓ ఆటడేసుకుంటున్న పరిస్థితి. బాధ్యత గల వృత్తిలో ఉంటూ ఏంటిది అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ దుర్గగుడి వద్ద డ్యూటీకి వచ్చిన పోలీసులు చేసిన నిర్వాకం ఏంటి...
విజయవాడ కనకదుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ఫోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దుర్గ గుడి ఉన్నతాధి అధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు.
దసరా ఉత్సవాల తొలిరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని 49వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు. రెండో రోజు అమ్మవారిని 65వేల మంది దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
నవరాత్రుల్లో ముచ్చటగా మూడోరోజు.. అంటే శనివారం అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమైన దుర్గమ్మ. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు.
Andhrapradesh: పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవిని దర్శించుకుని భక్తులు తరిస్తారు. మరోవైపు దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తోంది.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వంసిద్ధమైంది. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు గురువారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు.
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.