Home » Kanaka durga temple
రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించే భక్తుల్లో కొందరు ఇంద్రకీలాద్రి విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
Warahi Celebrations: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి.
Vijayawada Durgamma: ప్రతిరోజూ ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ది కార్యక్రమాలు ఉంటాయి. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించి..
Indrakeeladri: తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే భక్తుడు బెజవాడ కనకదుర్గ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ ఆయనను అభినందించి అమ్మవారి తీర్థ ప్రసాదములను అందజేశారు.
దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్ళు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన కేసుల ఫైళ్లు గల్లంతు అయ్యాయి. ఈ ఫైళ్ల ఆధారంగానే కోర్టు కేసుల్లో కౌంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఫైళ్లు కనిపించకపోవడంతో ఈవో వాటికి సంబంధించిన అధికారులను పిలిచి వివరాలు అడిగారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ ఉత్తర్వులు చూసి అందరూ నివ్వెరపోయారు. ఎక్కడి వారిని అక్కడే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
Durgamma Temple: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కొత్తరకం దందా వెలుగులోకి వచ్చింది. అమ్మవారి దర్శనం కల్పిస్తామని మాయ మాటలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నయా దందాను ఆలయ అధికారులకు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీఐపీల వద్ద నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని చంద్రబాబు అన్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవాని దీక్ష విరమణలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారిని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ శృంగేరి పీఠాధిపతికి దుర్గ గుడి ఈవో రామారావుతోపాటు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.