• Home » Kamareddy

Kamareddy

R Krishnaiah : కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి..

R Krishnaiah : కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి..

కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Banswada: ఒకేరోజు ఇద్దరు మునిసిపల్‌ కమిషనర్ల సస్పెన్షన్‌

Banswada: ఒకేరోజు ఇద్దరు మునిసిపల్‌ కమిషనర్ల సస్పెన్షన్‌

అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్‌ కమిషనర్లను సస్పెండ్‌ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్‌ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్‌ మునిసిపల్‌ కమిషనర్‌, ప్రస్తుత తుర్కయాంజల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు.

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

Kamareddy: నార్సింగ్‌ మునిసిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం..

గండిపేట మండలం నార్సింగ్‌ మునిసిపాలిటీని అధికార కాంగ్రెస్‌ దక్కించుకోగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మునిసిపాలిటీలో మాత్రం ఆ పార్టీకి షాక్‌ తగిలింది. అక్కడ ఇటీవలే కాంగ్రె్‌సలో చేరిన మునిసిపాలిటీచైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టగా బీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు కాంగ్రెస్‌ సభ్యులు కూడా అనుకూలంగా ఓటేశారు. శనివారం నార్సింగ్‌ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌గా ఉన్న రేఖ, వైస్‌చైర్మన్‌గా ఉన్న వెంకటేశ్‌ యాదవ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది.

TG: నెత్తురోడిన రహదారులు..

TG: నెత్తురోడిన రహదారులు..

అతి వేగంతో వాహన ప్రయాణం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలో రాంసాన్‌పల్లి శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబమే బలైపోయింది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం తాడ్కూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌(35), సునీత(30) దంపతులకు కుమారుడు నగేష్‌(7) ఉన్నాడు. వీరు ముగ్గురు శుక్రవారం బైక్‌పై తాడ్కూర్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు.

Hyderabad: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్‌ స్వాధీనం..

Hyderabad: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్‌ స్వాధీనం..

అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్‌ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ బాధ్యులు అద్దె చెల్లించనందు వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్‌లో ప్రకటించారు. మాల్‌లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు.

TS News: మహిళ మెడికల్ ఆఫీసర్‌‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..

TS News: మహిళ మెడికల్ ఆఫీసర్‌‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..

మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

Kamareddy: పోలీసుల అదుపులో కామారెడ్డి  డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌

Kamareddy: పోలీసుల అదుపులో కామారెడ్డి డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌ సింగ్‌, శ్రీనునాయక్‌పై తాజాగా మరికొందరు పీహెచ్‌సీల మహిళా మెడికల్‌ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

Congress: నేడు తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

Congress: నేడు తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి