Home » Kalyanadurgam
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నువ్వా నేనా అన్న తీరుగా వైసీపీ, కూటమి నేతలు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే టీడీపీ, వైసీపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పలు చోట్ల ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. ఇరువర్గాల నేతల మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు సదరు అభ్యర్థులు.
Andhrapradesh: కళ్యాణదుర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఒక్కటవడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బుధవారం ఎన్టీఆర్ భవన్లో ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించగా.. టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
కళ్యాణదుర్గం( Kalyanadurgam )లో వైసీపీ నేతల (YCP Leaders) మధ్య వైరం మరోసారి రచ్చకెక్కింది. మొహరం(Moharam) సందర్భంగా వైసీపీలోని ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు.
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్ పర్యటన అంటే చాలు.. ఏపీలో అధికారుల అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.. సీఎం వస్తున్నారంటే చాలు.. వారం, పది రోజుల ముందునుంచే హంగామా చేస్తారు.
జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్కు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో మంత్రి తీరును అసమ్మతి వర్గనేతల తీవ్రంగా వ్యతిరే్కిస్తున్నారు. చివరకు ఈరోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎంపీ తలారి రంగయ్య సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి వ్యవసాయ క్షేత్రంలో అసమ్మతి వర్గ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.
జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది