Home » KADAPA
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామి వారి ప్రసాదం స్వీకరించారు.
సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పులివెందులలో జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల మధ్య సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులతో పాటు ప్రముఖులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు
వైసీపీ నేత అంజద్బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. వివిధ క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి
Ahmed Basha Arrested: మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాషను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఆయన ఉన్నట్లు సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు.
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈనెల 11న సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు.
Adinarayana Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్, అవినాష్ రెడ్డిలకు వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. ముందు వివేకా హత్య కేసులో వారిద్దరూ ముద్దాయిలు కాదని తేల్చండి అని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు.
చెన్నై సెంట్రల్-ముంబై(వయా కడప) ప్రత్యేక వారాంతపు రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 9,16,23,30 తేదీల్లో నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.