Home » KADAPA
kadapa Dist: పులివెందులలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ను కొంతమంది వెంబడించారు. దీంతో ఆందోళన చెందిన సునీల్.. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Kadapa Municipal Corporation: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు మోహరించారు.
ఈ నెల 20న జరిగే కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్కు తగిన భద్రత కల్పించాలని మంగళవారం కడప జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. బయట వ్యక్తులను కార్పొరేషన్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది.
కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. సోమవారం ఇక్కడి ఐఎంఏ హాలులో సుంకర పద్మశ్రీ, ఇద్దరు మాజీ డీసీసీ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్ అహమ్మద్...
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. గత ఆరునెలలుగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుని..
సమాజంలో మన ఎక్కడ వైఫల్యం చెందామనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కంబాలదిన్నె కేసు నిందితుడ్ని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు.
Mahanadu: పులివెందుల (Pulivendula)లో మహానాడు (Pulivendula) టీడీపీ తోరణాలను (TDP Banners) తొలగించిన వైసీపీ శ్రేణుల (YCP Activists)పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి (PA Raghav Reddy), మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్ (Varaprasad)లతోపాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 191,2. 191,3. 324,4.109 రెడ్ విత్ 190 బీఎంఎస్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు.
కడపలో జరిగిన టీడీపీ మహానాడు సూపర్ హిట్గా ముగియగా, లోకేష్ మార్కు ముఖ్యాంశాలు, చంద్రబాబు అధ్యక్షత్వంలో పార్టీలో సమయపాలన పై పెద్దపీట వేసారు. లక్షలాది కార్యకర్తలు, అభిమానులు బహిరంగ సభకు హాజరై విజయ సంబరాలు జరుపుకున్నారు.
ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.
టీడీపీ మహానాడు మూడో రోజు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఏపీలోని కడప జిల్లాలో జరుగుతున్న మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు..