• Home » KA Paul

KA Paul

KA Paul: అందుకే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశా...

KA Paul: అందుకే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశా...

పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దు అంటే అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.

KA Paul: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు..!!

KA Paul: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు..!!

స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు.

AP Elections: 48 గంటల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా

AP Elections: 48 గంటల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.

AP Politics: వారు నాకు శత్రువులు కాదు.. నా శిష్యులే:  కేఏ పాల్

AP Politics: వారు నాకు శత్రువులు కాదు.. నా శిష్యులే: కేఏ పాల్

ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పడిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. విశాఖలో భారీగా ఓట్లు పోల్ అయ్యాయని...ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి నేనే అడ్డుకున్నాను..ఇది దేవుడి కృప అన్నారు.

KA Paul: లోకల్ బ్రాండ్ కావాలా.. అమెరికన్ బ్రాండ్ కావాలా?

KA Paul: లోకల్ బ్రాండ్ కావాలా.. అమెరికన్ బ్రాండ్ కావాలా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్నిరోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలోనూ..

AP Elections: జగన్‌, కూటమికి ఓటేస్తే బీజేపీని గెలిపించినట్టే: కేఏపాల్

AP Elections: జగన్‌, కూటమికి ఓటేస్తే బీజేపీని గెలిపించినట్టే: కేఏపాల్

Andhrapradesh: జగన్‌కు, కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్టే అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. బీసీ, దళిత, క్రైస్తవులు, ముస్లిం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీకి స్పందన అద్భుతంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీకి నాలుగు లక్షల ఓట్లు వస్తే...

AP Elections: పార్లమెంట్‌లో అడుగు పెడితే..

AP Elections: పార్లమెంట్‌లో అడుగు పెడితే..

ఎంపీగా గెలిచి... పార్లమెంట్‌లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే  ఆగింది.. కేఏ పాల్ సంచలనం..!!

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగింది.. కేఏ పాల్ సంచలనం..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

KA Paul: ఈ ఎన్నికల్లో నాతో పొత్తుకు సిద్ధమా.. కేఏ పాల్ బంపరాఫర్

KA Paul: ఈ ఎన్నికల్లో నాతో పొత్తుకు సిద్ధమా.. కేఏ పాల్ బంపరాఫర్

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పలు రాజకీయ పార్టీలకు బంపరాఫర్ ప్రకటించారు. ఒక ఛానల్ నిర్వాహకులు తనను ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోమని అడిగారని చెప్పారు. అయితే తాను ఏ రాజకీయ నాయకుడు దేశాన్ని బాగు చేయలేదు కాబట్టి పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.

KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..

KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..

Andhrapradesh: గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా..ఆంధ్రను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి