Home » Jupally Krishna Rao
Telangana: జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం సందర్శించారు. అనంతరం బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం కావడంతో తిరిగి ఆ పార్టీలో చేరతారా అనే సందేహాలు వచ్చాయి. ఆ వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. బండ్లతో చర్చలు జరిపి, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకొచ్చారు.
‘గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు రోజులుగా కొన్ని ప్రధాన పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటరిచ్చారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాస్.. గ్యాస్ అని ఈస్ట్మన్ కలర్ మాదిరిగా చెప్పారని.. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... 2023లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు చేసినట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని.. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం...
తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేయలేని పనిని తాము చేసి చూపించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భిక్కనూరులో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.11 వేల కోట్లు కేటాయించాల్సిందిగా ఆర్థికశాఖకు ప్రతిపాదనలు అందజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
తెలంగాణ టూరిజం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని టూరిజం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు అనందాచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్ను సన్మానించారు.