Home » Jogi Ramesh
గౌడ, బీసీ అని చెప్పుకునే కనీస అర్హత వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్కు లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthy Anuradha) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోలు వ్యవహారంలో తన కుమారుడు జోగి రాజీవ్(Jogi Rajeev) అరెస్టు కావడంతో జోగి రమేశ్(Jogi Ramesh) కుల ప్రస్తావనను తెరపైకి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు.
రాజకీయ కక్ష్యలతోనే తన కుమారుడు రాజీవ్ను అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతణ్ని అరెస్టు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
Andhrapradesh: మాజీ మంత్రి జోగిరమేష్పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు మైలవరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ... మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్ట్పై స్పందించారు.
Andhrapradesh: మాజీ మంత్రి జోగి రమేష్పై బీసీ నేత, శాసన మండలి మాజీ విప్ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబసభ్యుల అవినీతి పుట్ట కదులుతోందన్నారు. విజయవాడ శివారు అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను జోగి కుమారుడు రాజు...
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కులప్రస్తావన తెస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి చెప్పుకొచ్చారు.
అగ్రిగోల్డ్ స్కామ్ గంటగో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్లో రాజీవ్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ఏసీబీ (AP ACB) అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు...
Andhrapradesh: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు. అగ్రిగోల్డ్ భూముల విషయంపై బహిరంగ చర్చకు సిద్దం. మా కుటుంబం ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలకు అయినా సిద్దం....
ఏసీబీ దాడులతో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల పుట్ట బద్ధలవుతోంది. ఆయన దోపిడీ యవ్వారం అంతా బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
అమరావతి: అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరు నిందితులు ఉన్నారు. వారి వివరాలు..1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో ( MRO) జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులుగా అధికారులు తెలిపారు.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.