• Home » Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh CID Inquiry: సీఐడీ విచారణపై జోగి రమేష్ ఏమన్నారంటే

Jogi Ramesh CID Inquiry: సీఐడీ విచారణపై జోగి రమేష్ ఏమన్నారంటే

Jogi Ramesh CID Inquiry: చంద్రబాబు నివాసం వద్ద తాము ఏమీ దాడి చేయాలేదని.. తిరిగి వాళ్లే దాడి చేశారని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి.

Investigation: సీఐడీ విచారణకు జోగి రమేష్

Investigation: సీఐడీ విచారణకు జోగి రమేష్

అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఉదయం సిఐడి విచారణకు హాజరయ్యారు. అతనితో పాటు మరో ఐదుగురు కూడా హాజరయ్యారు.

Budda Venkanna : జోగితో మంత్రి ర్యాలీ బాధాకరం!

Budda Venkanna : జోగితో మంత్రి ర్యాలీ బాధాకరం!

ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి టీడీపీ నాయకులు, మంత్రి ర్యాలీలో పాల్గొనడం బాధాకరమని...

Minister Parthasarathy: జోగి రమేష్ వివాదం.. మంత్రి  పార్థసారథి  క్షమాపణలు

Minister Parthasarathy: జోగి రమేష్ వివాదం.. మంత్రి పార్థసారథి క్షమాపణలు

ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

Eluru: వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం..

నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.

AP Politics: జగన్‌కి జోగి ఝలక్..!

AP Politics: జగన్‌కి జోగి ఝలక్..!

ప్రతిపక్ష హోదాకు సైతం ఆమడ దూరంలో వైసీపీ ఉండడంతో.. కీలక నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు. ఆ క్రమంలో రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి.. పలువురు ఇప్పటికే టీడీపీలో చేేరారు. దీంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ అధినేతకు మరో బిగ్ షాక్ తగిలిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

AP Politics: వారు విచారణకు సహకరించడంలేదు.. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

AP Politics: వారు విచారణకు సహకరించడంలేదు.. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Supreme Court: విచారణకు సహకరించండి.. జోగి, అవినాశ్‌కు సుప్రీం ఆదేశం

Supreme Court: విచారణకు సహకరించండి.. జోగి, అవినాశ్‌కు సుప్రీం ఆదేశం

Andhrapradesh: టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు జోగిరమేశ్, అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం సుప్రీంలో విచారణ జరింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్, అవినాశ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

AP News: జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!

AP News: జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!

ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ ఎక్కడ? నందిగాం సురేష్ అరెస్ట్‌తో భయపడ్డారా? ఆ భయంతోనే ఆయన ఏపీ నుంచి పారిపోయారా? అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో తలదాచుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ఖాకీలు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్‌ను..

Mangalagiri: ముగిసిన విచారణ.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన జోగి రమేశ్

Mangalagiri: ముగిసిన విచారణ.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన జోగి రమేశ్

వైసీపీ నేత జోగి రమేష్‌ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన పోలీస్ విచారణ అనంతరం సర్కిల్ కార్యాలయం నుంచి జోగి రమేశ్ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో సైతం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ రోజు జరిగిన పోలీస్ విచారణకు తన తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, విజయవాడ నగరానికి చెందిన వైసీీపీ నేత పి. గౌతంరెడ్డితో కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి