Home » Jharkhand
ఝార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు.
జార్ఖండ్లో ఎన్నికల టైం దగ్గర పడింది. ప్రధాన పార్టీల నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు కీలక హామీలను ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘట్శిలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయుల వలసలతో రాష్ట్రంలో ఆదివాసీల జనాభా గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో హేమంత్ సోనెర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రంతో పాటుగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఝార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఝార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్లు నియోజకవర్గాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
2019 నామినేషన్లో ఆయన తన వయస్సును 42 ఏళ్లుగా చెప్పుకోగా, ఈ ఏడాది దాఖలు చేసిన అఫిడవిట్లో 49 ఏళ్లుగా డిక్లేర్ చేయడం పలు ప్రశ్నలకు , విమర్శలకు దారితీసింది. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.
జార్ఖండ్, మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో చిచ్చురేగింది. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి వామపక్షాలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో ప్రచారానికి రావాల్సిందిగా శివసేన-యూబీటీ, ఎన్సీపీ-ఎస్పీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ను ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ కార్యకర్తలు ఉన్న ప్రాంతాల్లోనూ, వివాద రహిత అభ్యర్థులు ఉన్న చోట్ల ప్రచారానికి ఆయన అంగీకరించారు.
బర్హైత్ (ఎస్టీ) నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా హేమంత్ సోరెన్ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థి సైమాన్ మాల్టేపై 25,740 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గాండేయ్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై 27,149 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.