Home » Jharkhand
రాష్ట్రవ్యాప్తంగా 15, 344 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 200 కంపెనీల భద్రతా బలగాలను మోహరించారు. తొలి విడతలో భాగంగా 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుండగా, వీటిలో 17 జనరల్ సీట్లు, 20 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు, ఆరు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి.
వక్ఫ్ బోర్డులో మార్పులను తాము వ్యతిరేకిస్తున్నట్టు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే వాళ్లు ఎన్ని చెప్పినా వక్ఫ్ చట్టానికి సవరణలు తెచ్చే బిల్లును బీజేపీ ఆమోదిస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అమిత్షా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత అలంఘీర్ అలమ్ ఇంట్లో రూ.30 కోట్లకు పైగా పట్టుబడిన విషయాన్ని అమిత్షా ప్రస్తావిస్తూ, 27 కౌంటింగ్ మిషన్లతో పట్టుబడిన సొమ్మును లెక్కించారని, ఈ డబ్బంతా ఎక్కడదని ప్రశ్నించారు. ఇదంతా జార్ఖాండ్ ప్రజలకు మోదీ పంపిన సొమ్మని, దానిని హేమంత్ సోరెన్ ప్రభుత్వం హస్తగతం చేసుకుందని చెప్పారు.
కాంగ్రెస్-జేఎంఎం కూటమి ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చేస్తోందని, ఉపకులాలను ఉసిగొలుపుతోందని మోదీ ఆరోపించారు. ఛోటానగర్ ప్రాంతంలో 125 ఓబీసీ ఉప కులాలు ఉన్నాయని మోదీ అన్నారు. అంతా కలిసి ఉంటేనే అందరికీ క్షేమమని అన్నారు
రాజ్యాంగంపై బీజేపీ నిరంతర దాడి చేస్తోందని, అయితే ఇండియా-కూటమి నిరంతరం రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించేందుకు తామ (కాంగ్రెస్) కట్టుబడి ఉంటామని రాహుల్ చెప్పారు.
ఈ నెల 13, 20 తేదీల్లో.. రెండు దశల్లో జరగనున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ, మహిళా ఓటర్లే ఫలితాల్ని నిర్ణయించనున్నారు.
ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీకి ఓటు వేయాలనేది ప్రజలకు ఆయా పార్టీలు వివరించాల్సి ఉంటుందని, తమ కూటమి ప్రధానంగా 7 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తోందని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ఖర్గే, హేమంత్ సోరెన్ తెలిపారు.
ఝార్ఖండ్లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం రాష్ట్రమంతటా బంగ్లాదేశ్ చొరబాటుదారులకు నివాసం కల్పిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారికి పాలక కూటమి జేఎంఎం-కాంగ్రె్స-ఆర్జేడీ పార్టీలు అండగా ఉన్నాయన్నారు.
బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు ఇది రెండవ ర్యాలీయే అయినప్పటికీ రాష్ట్రంలో గెలుపుపై ఇప్పటికే నమ్మకం కలిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశ నూరవ స్వాతంత్ర్య దినోత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యావద్దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో జార్ఖాండ్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుందని చెప్పారు.