Home » Jharkhand
మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం పూట పోలింగ్ తక్కువగా నమోదైంది. మహారాష్ట్రలో ఉదయం 9 కేవలం 6.61 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.
పోలింగ్ పూర్తయిన అనంతరం వెలువడే "ఎగ్జిట్ పోల్స్''పై సహజంగానే ప్రజల్లో ఉత్సుకత ఉంటుంది. ఓటింగ్ బూత్ నుంచి నిష్క్రమించేటప్పుడు తాము ఎంచుకున్న అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి కసరత్తు జరుగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ పోల్స్ తరహాలో కూడా సాగుతాయి.
మహారాష్ట్ర, జార్ఖండ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది.
జార్ఖాండ్లో ప్రధాన పోటీ అధికార జార్ఖాండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని 'ఇండియా' కూటమికి, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మధ్య ఉంది. 'ఇండియా' కూటమిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి.
కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లల్లో పెద్దఎత్తున నోట్లకట్టలు పట్టుబడ్డాయని, ఈ సొమ్మంతా కాంగ్రెస్దా, ఆర్జేడీ లేదా జేఎంఎందా అని ఆయన ప్రశ్నించారు. అందతా రాష్ట్రాభివృద్ధికి మోదీ పంపిన సొమ్మని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు.
జార్ఖాండ్లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. దీనితోపాటు కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి... దేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లోని మొత్తం 31 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉప ఎన్నిక జరిగింది.
కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం చాలాకాలంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాయని, అయినప్పటికీ సంథాల్ పరగణకు వారు ఇచ్చినది కేవలం వలసలు, పేదరికం, నిరుద్యోగమేనని ప్రధాని మోదీ విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారని అన్నారు.
Elections: దేశంలో మరో కీలక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలింగ్ కూడా మొదలైపోయింది. దీంతో అక్కడి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది.