• Home » Jeevan Reddy

Jeevan Reddy

TG News: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

TG News: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యలపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీవన్‌రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల పీఎస్‌లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు (శుక్రవారం) కేసు నమోదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు.

Jeevan Reddy: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణం

Jeevan Reddy: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణం

మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాడని.. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ విశ్వాసాలను రెచ్చగొట్టుతున్నాడని.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రామాలయం దేవాలయ గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీయే అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

BRS: బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు.. సజ్జనార్‌పై మండిపడ్డ జీవన్ రెడ్డి

BRS: బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు.. సజ్జనార్‌పై మండిపడ్డ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే కారణంతోనే కాంగ్రెస్ తమపై కక్షకట్టిందన్నారు.

Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

Telangana: నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన జీవన్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విరుచుకుపడ్డారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్ ఐదు సంవత్సరాలు గడిచినా బోర్డ్ తేలేదని విమర్శించారు.

Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్

Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్

Telangana: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా అని ప్రశ్నించారు.

Congress: కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలి.. జీవన్‌రెడ్డి ఎద్దేవా

Congress: కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలి.. జీవన్‌రెడ్డి ఎద్దేవా

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలని ఎమెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఖరీఫ్ సాగు నీరు అందకపోవడానికి కేసీఆరే కారణమన్నారు. కరువుకు కేసీఆరే కారణమని విమర్శించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టని అన్నారు. కమిషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు.

Congress-BRS: చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణ

Congress-BRS: చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణ

జగిత్యాలలో చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్‌ల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. దీనిని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు

Kadiyam Srihari: ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సహజమే..

Kadiyam Srihari: ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సహజమే..

బీఆర్ఎస్‌ను బూచీగా చూపించి మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని హెచ్చరించారు. మాకు ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన లేదన్నారు. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి సూచించారు.

Sridhar Babu: నేను అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Sridhar Babu: నేను అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

మా నాన్న (శ్రీపాద రావు) ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Jeevan Reddy: అరవింద్‌కు ఓటు అడిగే హక్కు లేదు

Jeevan Reddy: అరవింద్‌కు ఓటు అడిగే హక్కు లేదు

బీజేపీ ఎంపీ అరవింద్‌(Aravind)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందా..? అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి