Home » Jeevan Reddy
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో నేతల క్యూ మొదలైంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కున్నారు. తనకు తెలియకుండానే సంజయ్ కుమార్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీలో కోరినట్లుగానే న్యాయ విచారణ కమిషన్ను వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర వ్యవస్థగా విచారణ చేస్తున్నందు వల్ల అందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అని కొత్త నాటకానికి తెర తీస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో కాదని దామర చర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా...? అని ధ్వజమెత్తారు. అక్కడ నెలకొల్పడంతో బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని నిలదీశారు.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులనూ అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జీవన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మొకీల, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాపాడేందుకే ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ.. సీబీఐ విచారణ కోరుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నిరసన చేపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్స్టాండ్ సమీపంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. టీజీఎస్ఆర్టీసీకి(TGRTC) పెండింగ్లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కోర్టు ఆదేశించింది.
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యలపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జీవన్రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల పీఎస్లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు (శుక్రవారం) కేసు నమోదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు.
మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాడని.. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చేస్తారనడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ విశ్వాసాలను రెచ్చగొట్టుతున్నాడని.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రామాలయం దేవాలయ గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీయే అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే కారణంతోనే కాంగ్రెస్ తమపై కక్షకట్టిందన్నారు.
Telangana: నిజామాబాద్లో పసుపు బోర్డుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో అల్పాహారం చేసిన జీవన్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై విరుచుకుపడ్డారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్ ఐదు సంవత్సరాలు గడిచినా బోర్డ్ తేలేదని విమర్శించారు.