Home » JDU
లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
బిహార్లో రోజుల వ్యవధిలో వంతెనలు వరుసగా.. పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్లోని వంతెనల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ వంతెనల కూలిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి తన తలపాగాను ఎట్టకేలకు తొలగించారు. 2022లో తలపాగా ధరించిన చౌదరి దాదాపు 22 నెలల తర్వాత తన తలపాగాను తొలగిస్తూ.. శ్రీరాముడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని జనతాదళ్ (యునైటెడ్)-JDU శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ మహాసభల్లో తీర్మానం చేసింది.
జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్కుమార్ అధ్యక్షతన జరిగిన కోర్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనతా దళ్ యూనైటెడ్ పోటీలో ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ తమ వైఖరిని వెల్లడించింది. స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసే అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి శుక్రవారంనాడు తెలిపారు.
లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
‘మోదీ 3.0’ సర్కారు ఆదివారం కొలుదీరింది. దేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ, 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 32 మంది సహాయ మంత్రులు కలుపుకొని మొత్తం 72 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక్కడి వరకు ఓకే.. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తున్న ఆసక్తికరమైన ప్రశ్న లోక్సభ స్పీకర్ ఎవరు?.
జనతాదళ్ (యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ఇండియా కూటమి ‘ప్రధాని’ పదవి ఆఫర్ చేసిందని ఇటీవల ఆ పార్టీ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం..