Home » Jayashankar Bhupalapally
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల లొల్లి రాజుకుంది. భూపాలపల్లి మండల పరిధి ఆజంనగర్లోని పోడు భూముల వద్దకు ఫారెస్టు అధికారులు గురువారం ట్రెంచ్లు కొట్టేందుకు యంత్రాలతో వెళ్లగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
తెలంగాణ: ఆడవారిపై అత్యాచారాలు, హత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా మహిళలపై ప్రతి రోజూ లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకో అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది. ఒక ఘటన జరిగి దాన్ని మరవకముందే మరో ఘటన కలకలం రేపుతోంది.
ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. బాలికలు ఉండే హాస్టళ్లలోకి దుండగులు చొరబడుతున్నారు. వసతి గృహాల్లో సరైన భద్రత చర్యలు లేవనేదానికి పలు ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను బీఎస్సీ(ఆనర్స్) వ్యవసాయ కోర్సులో పెంచుతున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ప్రకటించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలంలోని గంగపురి-మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగులో రాత్రి బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాలీ డ్రైవర్ను సురక్షితంగా బయటకు చేర్చారు. అయితే బొలెరో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
Telangana: జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు.
Telangana: పోలీస్స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్స్టేషన్లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.