Home » Janasena
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో గత ప్రభుత్వ పాలనలో ఎన్ని నిధులు ఏ ఏ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది.
పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే..
గురువారం దీపావళి సందర్భంగా ఏలూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకరోజు ముందుగానే అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తమకు కనీస సమాచారం అందించకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటి అని టీడీపీ నేతలను, అధికారులను జనసేన నాయకులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
‘అనవసరంగా చెడ్డపేరు వస్తోంది. ఎమ్మెల్యేగా ఎందుకయ్యామా అని బాధేస్తోంది’ అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి వాపోయారు.
మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు.
వాల్మీకి జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్ళకు కట్టే రామాయణం ప్రజలకు నైతిక వర్తనను వెల్లడిస్తుందని, ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందన్నారు.
ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కా రానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇనచార్జ్ పోతుల సాయినాథ్ పిలుపు నిచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ స్థలం పత్రాలను ఆ గ్రామ పెద్దలకు అధికారికంగా అంద చేశారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి.. ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు.
పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన పవన్కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కూతురు ఆధ్య తో ఆయన దర్శనానికి వచ్చారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత వచ్చారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చూడగానే భక్తులలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
కొత్తగా పార్టీలోకి వచ్చేవారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పల్లెపల్లెకూ జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లాలని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బాలినేని