Home » Janasena
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు కాల్స్పై దర్యాప్తు చేసిన పోలీసులు పురోగతి సాధించారు. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేసి.. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేదని, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేశాడని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.
తేమ 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశిలిచ్చామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తనకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారని.. బిజీ షెడ్యూల్లో తనకు సాదర స్వాగతం పలికిన ఉప రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని అన్నారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని, ఆంధ్రప్రదేశ్కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్లా అభివృద్ధి చేయవచ్చునని అన్నారు.
కొండేపి నుంచి ఒంగోలుకు వచ్చి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని వైసీపీ సీనియర్ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి ఇలా మాట్లాడటం బాలినేనికి తగదని చెవిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
AP Politics: నిడదవోలులో రాజకీయం మారిపోయింది. రాజకీయం రసవత్తరంగా మారింది. చైర్మన్ కుర్చీలాటలో వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. వైసీపీ రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో కొత్త రంగు పులుముకుంది.
ఫ్యాన్ గాలి మారింది. రెక్కలు ఒక్కొకటిగా ఎగిరిపోతున్నాయి. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. అవకాశం వస్తే జారుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు.
గుంటూరు జిల్లా: ఏపీలోని సమాచార శాఖ ఉద్యోగులకు ఇంకా వైఎస్సార్సీపీ ప్రభుత్వ మత్తు వీడలేదు. ప్రజా ప్రతినిధుల పర్యటన సమాచారంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలపై ఐఅండ్ పీఆర్ పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. ఆదివారం గుంటూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఐఅండ్పీఆర్ సమాచారం ఇవ్వలేదు.