Home » JANASENA
47 మార్కెట్ కమిటీలకు సంబంధించి టీడీపీ ఛైర్మన్లను ప్రకటించింది. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయనుంది. 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.
Janasena party: తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో డీలిమిటేషన్పై ఇవాళ సమావేశం జరిగింది. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని జనసేనకు కూడా ఆహ్వానం పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan Orders Ignored: స్యయంగా అధినేత ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదు జనసేన నేతలు. ఇటీవల చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. అయితే ఆ తరువాతే చిత్రాడ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
MP Uday Srinivas: హిందూ ఆలయాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయని కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చర్చించారు. హిందూ ఆలయాలకు వచ్చే నిధులు ఎలా ఖర్చుపెడుతున్నారనే విషయాలను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు.
చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్కల్యాణ్ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్ రేట్ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇ
Pawan Kalyan Pithapuram visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి పిఠాపురంకు బయలుదేరి వెళ్లారు. పిఠాపురం చిత్రాడలో జరిగే జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ఎలా అయ్యారు. 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు తేడా ఏమిటి.. పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో ఏం సాధించింది.
పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ తన పవరేంటో చూపించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ పనైపోయిందనుకున్నవాళ్లంతా.. 2024 ఫలితాల తర్వాత పవన్దే భవిష్యత్తు అనడం వెనుక కారణం ఏమిటి. తనను తీవ్రంగా విమర్శించిన రాజకీయ ప్రత్యర్థులకు పవన్ తన దెబ్బను రుచి చూపించారా.
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం అత్తోటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎర్రు బాపారావు ఆధ్వర్యంలో ‘కూటమి’ ప్రభుత్వంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
వైసీపీ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.