Home » Janasena
కృష్ణా జిల్లా: ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు, రొయ్యూరులో పర్యటించనున్నారు. వయా గొడవర్రు రోడ్డు పనుల పరిశీలించనున్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు.
రుషికొండలో ప్యాలెస్ నిర్మాణం కోసం రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేసిన గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోయిందని...
నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం టీడీపీలో పెనుతుపాను రేపుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ నాయకులను బూతులు తిట్టి.. కేసులతో వేధించి.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ నేతలకు ఈ కార్యక్రమంలో పెద్ద పీట వేయడమే కాకుండా వారితో కలిసి వేదిక పంచుకోవడం తమ్ముళ్ల ఆగ్రహావేశాలకు కారణమైంది.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్ప తనం అర్థమైందన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే..
అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను చంపేస్తామంటూ ఆయన ఓఎస్డీ వెంకటకృష్ణకు ఫోన్ చేసి బెదిరించిన కేసులో నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు కాల్స్పై దర్యాప్తు చేసిన పోలీసులు పురోగతి సాధించారు. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేసి.. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేదని, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేశాడని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర తనిఖీలు ఎందుకు అని అందరూ ఆలోచనలు చేస్తున్నారని, జగన్ సిఎంగా ఉన్నప్పుడు డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని, రూ.16 వేల కోట్లు వృధా చేశారని మంత్రి ఆరోపించారు.