Home » JANASENA
అమరావతి రాజధాని పనులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.1.07 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి
పహల్గాం ఉగ్రదాడిని దేశ సమగ్రతపై దాడిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. అమరుడైన జనసైనికుడి కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు.
Minister Nadendla Manohar: ఉగ్రవాదుల దుశ్చర్యలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
కశ్మీర్లో టూరిస్టులపై దాడి హేయమైన చర్య అని శాసనమండలి సభ్యుడు కొణిదల నాగేంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఎవరిపైనో జరిగిన దాడిలా కాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జరిగిన దాడిగా భావించి ఖండించాలని ఆయన అన్నారు.
Pawan Kalyan: జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్కల్యాణ్ వెల్లడించారు.
Pawan Kalyan:సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. అల్లూరి జిల్లా ప్రజలకు అండగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులకు చెప్పులు లేని విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు వారికి చెప్పులు పంపించి తన గొప్ప మనస్సును పవన్ కల్యాణ్ చాటుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల్లో ఇరికించి రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన బూతులు తిట్టడం ద్వారా పార్టీ శ్రేణులను తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది
వలంటీర్ ఉద్యోగాల పేరుతో యువతను వైసీపీ ప్రభుత్వం వంచించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వేతనాల చెల్లింపులకు ప్రభుత్వ ఉత్తర్వులు లేవని, నియామక ప్రక్రియ అస్పష్టమని తెలిపారు
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్ చేయగా, బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా ఆరోపిస్తూ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.