Home » Jai Shankar
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు
పీఓకేను భారత్లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్కు వార్నింగ్ ఇచ్చారు.
భారత్లో జరుగుతున్న ఎన్నికలను వీక్షించేందుకు దేశానికి 10 దేశాలకు చెందిన 18 రాజకీయ పార్టీల నేతలు వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు సార్వత్రిక ఎన్నికలను వీక్షించేందుకు విదేశీ రాజకీయ నాయకులు వచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణ పద్ధతుల గురించి వారంతా తెలుసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విదేశీ రాజకీయ నాయకులందరికీ బీజేపీ ఎన్నికల ప్రచార పద్ధతుల గురించి సవివరమైన సమాచారాన్ని అందజేస్తారు.
వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.
కచ్చాతీవు ద్వీపం వ్యహహారం అకస్మాత్తుగా తెరపైకి వచ్చినది కాదంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తాజాగా కౌంటర్ ఇచ్చారు. కొందరు ''చాలా వేగంగా రంగులు మారుస్తుంటారు'' అంటూ జైశంకర్పై విమర్శలు గుప్పించారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు సరిహద్దులు దాటుుతన్నాయి. పాక్ జలసంధిలోని కచ్చతీవు ద్వీపంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. సీఏఏ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందుతున్నామని మార్చి 11న అమెరికా ( America ) విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.
కర్ణాటక నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులను బరిలోకి దింపాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఈ అంశాన్ని మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరించారు.
విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే భారత విద్యార్థులను సమీప భారత ఎంబసీలు, కాన్సులేట్లలో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నామని కేంద్రం వెల్లడించింది.