• Home » Jagtial

Jagtial

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

సీతారా ముల కల్యాణోత్సవం ఆదివారం గోదావరిఖని కోదండ రామాలయంలో అంగరంగవైభవంగా జరి గింది. మినీ భద్రాచలంగా పేరొందిన కోదండ రామాలయం ఆవరణలో కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యా ణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షిం చి తరించారు.

దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం

దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం

దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ ముఖ్య ఉద్దేశ్యమని మాజీ ఎమ్మెల్యే గు జ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండాను ఎగురవేశారు.

మహనీయుల స్ఫూర్తితో సామాజిక అణిచివేతపై పోరాడాలి

మహనీయుల స్ఫూర్తితో సామాజిక అణిచివేతపై పోరాడాలి

కార్మిక ఉద్యమ నిర్మాత, సీఐటీ యూ వ్యవస్థాపక అధ్యక్షుడు బిటి రణదీవే వర్ధంతిని ఆదివారం సీఐటీయూ ఆఫీసు శ్రామికభవన్‌లో నిర్వహించారు. రణదీవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ’సామాజిక న్యాయం- సీఐటీయూ అవగాహన’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజనతోనే సన్నబియ్యం

గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజనతోనే సన్నబియ్యం

ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కిలోల సన్నబియ్యం అందజేస్తుందని బీజేపీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని పలు రేషన్‌ షాపులను బీజేపీ నాయకులు సందర్శించి రేషన్‌ షాపు ఎదుట మోదీ చిత్రపటం పెఆ్టలని డీలర్లను డిమాండ్‌ చేశారు.

ఘనంగా రంజాన్‌

ఘనంగా రంజాన్‌

జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ప్రసంగాలు విని ఆధ్యాత్మిక భావంతో పరవశించిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుల, మతాతీలకు అతీతంగా బంధు మిత్రులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు.

మైనింగ్‌ శాఖలో సిబ్బంది కొరత

మైనింగ్‌ శాఖలో సిబ్బంది కొరత

జిల్లా మైనింగ్‌ శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వేదిస్తోంది. పోస్టులు మంజూరు కాకపోవడం, మంజూరు అయిన పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంటుండడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. దీంతో మైనింగ్‌ శాఖలోని అధికారులు ప్రజలకు అందుబాటులోకి రావడమే గగనంగా మారుతోంది.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

రామగుండం అభి వృద్ధికి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదని, ప్రస్తు తం అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉన్నా యని, పనుల్లో వేగం పెంచాలని రామగుండం ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ అధికారులను ఆదేశించారు. సోమవా రం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ అరుణశ్రీ, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం లలి త్‌కుమార్‌, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

సాయికుమార్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి

సాయికుమార్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి

ముప్పిరితోటలో ప్రేమ పేరుతో ఈనెల 27న జరిగిన సాయికుమార్‌ దారుణహత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పౌరహక్కుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ముప్పిరి తోట గ్రామాన్ని సందర్శించారు.

 ఫ్లై ఓవర్‌ నిర్మించాలి

ఫ్లై ఓవర్‌ నిర్మించాలి

ప్రజల ప్రాణాలు పోతున్నా హెచ్‌కేఆర్‌ రోడ్డు సంస్థ పట్టించు కోవడం లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు మండిపడ్డారు. ప్రమాదాలకు నిలయంగా మారి నిత్యం వాహనాలు బోల్తాపడుతున్నా మూలమలుపును సీపీఐ బృందం సోమవారం పరిశీ లించింది.

 జోరుగా అక్రమ మట్టి దందా

జోరుగా అక్రమ మట్టి దందా

ధర్మారంలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి తీయాలంటే ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి