Home » Jagitial
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని(Loan waiver) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలన్నీ ఒకే రోజులో మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ఫిరాయింపులకు పాల్పడ్డ ప్రజా ప్రతినిధులను డిస్క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ, పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ఇదే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు అన్నారని కానీ, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్సలోకి ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
అయోధ్య రామ మందిరానికి సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి సహకారంతో నిర్మించిన ఽశ్రీరామ ధనుస్సుకు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాగు పనులు ఊపందుకోనున్నాయి. తొలకరి వానలకు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో పలు చోట్ల మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రె్సలో చేరడం చట్ట వ్యతిరేకమని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే జి.జదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ను కాంగ్రె్సలో చేర్చు కోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎ్సలో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే.. గులాబీ పార్టీ ముఖ్యనేత కవితకు అత్యంత సన్నిహితుడు.. డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీలో కోరినట్లుగానే న్యాయ విచారణ కమిషన్ను వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర వ్యవస్థగా విచారణ చేస్తున్నందు వల్ల అందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు.