Home » Jagitial
జాబితాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(58) ఉదయం పని నుంచి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే కొన్ని రోజులుగా అతణ్ని చంపేందుకు పథకం రచించిన గుర్తుతెలియని దుండగలు.. ఇవాళ ఉదయం గ్రామానికి చేరిన కాంగ్రెస్ నేత గంగారెడ్డిని ఒక్కసారిగా కారుతో ఢీకొట్టారు.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మంది శ్రీనివాస్ పేరుతో గల వ్యక్తులు ఒక్కచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆసక్తికర సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది.
జగిత్యాల కేంద్రంగా వస్తు సేవల పన్ను ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అక్రమాల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఐటీసీ అవకతవకలపై సుమారు 9 నెలల క్రితం జగిత్యాలలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసి ఓ జీఎస్టీ ప్రాక్టిషనర్ను అదుపులోకి తీసుకున్న ఉన్నతాధికారులు..ఐటీసీ రికవరీపై దృష్టిపెట్టారు.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు అందలేదని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి.. పురుగు మందు చేతపట్టి నిరసనలు చేపట్టారు.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందిన విషయం విదితమే.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఎట్టకేలకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 15 రోజుల వ్యవధిలో గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఇద్దరు గురుకుల విద్యార్థులను తెల్లవారు జామున ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి, లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మెట్పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాల(Peddapur Gurukula School)లో విద్యార్థుల వరస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు. తమ పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.