• Home » Jaggareddy

Jaggareddy

సోనియా, రాహుల్‌ వల్లే మాకు పదవులు

సోనియా, రాహుల్‌ వల్లే మాకు పదవులు

తమ పదవులు, రాజకీయ భవితవ్యం... సోనియా, రాహుల్‌గాంధీ కష్ట ఫలితమేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీని హత్య చేసిన వారినే క్షమించేసిన గుణం సోనియా, రాహుల్‌, ప్రియాంకది అని గుర్తు చేశారు.

TG Elections: ఈ ఎన్నికల్లో మోదీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తాడు: జగ్గారెడ్డి

TG Elections: ఈ ఎన్నికల్లో మోదీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తాడు: జగ్గారెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. నెహ్రు, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోదీ తీసివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారని గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు.

Jaggareddy: శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే..

Jaggareddy: శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే..

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అభివర్ణించారు. ఆదివారం నాడు గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చరిత్ర.. ఆయన రాజకీయం మీద బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

TG Elections: కాంగ్రెస్ లో లీడర్లకు కొదవేం లేదు.. అందరూ తోపులే: జగ్గారెడ్డి

TG Elections: కాంగ్రెస్ లో లీడర్లకు కొదవేం లేదు.. అందరూ తోపులే: జగ్గారెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని.. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా తమకేం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నేతలు ఉండొచ్చు, బీజేపీలో ఇద్దరు ఉండొచ్చు.. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదని స్పష్టం చేశారు.

TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు

TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ నేతలు తాము దేశభక్తులమంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాముడు దేవుడు.. కానీ ఆయనను ఓ పార్టీకి లీడర్‌ను చేశారు

రాముడు దేవుడు.. కానీ ఆయనను ఓ పార్టీకి లీడర్‌ను చేశారు

రాముడు దేవుడేనని, కానీ ఆయనను ఓ పార్టీకీ లీడర్‌ను చేశారని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి అన్నారు....

Konda Surekha: భేదాభిప్రాయాలు వీడి పని చేయండి.. మెదక్ మనదే..

Konda Surekha: భేదాభిప్రాయాలు వీడి పని చేయండి.. మెదక్ మనదే..

మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని... ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ పంచాంగం చెప్పిన జగ్గారెడ్డి

పార్టీ పంచాంగం చెప్పిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్తేమి కాదన్నారు. అయితే అవకాశం వచ్చిన ప్రతీ సారి తాను పీసీసీ పీఠం అడుగుతానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.

TG Politics: కాంగ్రెస్ నేతలకు మరోసారి జగ్గారెడ్డి వార్నింగ్

TG Politics: కాంగ్రెస్ నేతలకు మరోసారి జగ్గారెడ్డి వార్నింగ్

సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో కొండాపూర్ మండలం మల్కాపుర్‌లోని వెంకటేశ్వర గార్డెన్‌లో కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి