Home » Jagan Mohan Reddy
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు పూనుకున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36రాజకీయ హత్యలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. నూతన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. 36హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు, వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా? అంటూ ఆమె సవాల్ విసిరారు.
నెల రోజుల టీడీపీ పాలనలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంట్లో గళమెత్తుతామని రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి(MP Ayodhya Rami Reddy) అన్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యను ఎంపీ ప్రస్తావించారు. బాధితుణ్ని కత్తితో చేతులు నరికి, తీవ్రంగా గాయపరిచి చంపడం దారుణం అని ఎంపీ అన్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్తున్నారు. ఎందుకో తెలుసా!? వైసీపీలో గ్యాంగ్ వార్ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు!
హింస, విధ్వంసం, అరాచకం గురించి వైఎస్ జగన్ మాట్లాడితే రోత పుడుతోందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.