Home » Jagan Mohan Reddy
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది. ఇసుక నుంచి బెరైటీస్ వరకూ... క్వార్ట్జ్ నుంచి గ్రానైట్ వరకూ దేన్నీ వదలకుండా వైసీపీ నేతలు, వారికి కొమ్ముకాసే కంపెనీలు అడ్డగోలుగా దోచుకొని రూ.కోట్లు దండుకున్నారు.
సొంతిల్లు... ప్రతి పేదవాడి కల. రానురాను నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి.
ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ చెప్పారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
అధికారం అడ్డుపెట్టుకుని సొంత ఆస్తులు భారీగా పెంచుకున్న జగన్.. ప్రభుత్వ సంపద పెంచానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
జగన్ ప్రభుత్వం దిగిపోవడంతో ‘జే ట్యాక్స్’ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్కు, మద్యం ధరలకు సంబంధం ఏంటంటే... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే.
అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోళ్లలో జగన్ రెడ్డికి 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు.
రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లను మార్చేయడం... మద్యం విధానం... ఇసుక పాలసీ... స్మార్ట్ మీటర్ల టెండర్లు... బైజూస్ ట్యాబ్లు... తాజాగా ‘సెకీ’తో ఒప్పందం పేరిట అదానీ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు! అన్నీ వివాదాస్పదమే... అన్నింటా ‘ఆర్థిక’ ఆరోపణలే!
లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే..