Home » Jagan Cases
జగన్ పాలనలో సర్వే, సెటిల్మెంట్ శాఖ నిధుల దుర్వినియోగానికి కేరాఫ్ అడ్ర్సగా మారింది. నాటి ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైన కొందరు కీలక అధికారులు...
రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది. ఐదేళ్ల జగన్ పాలనలో ఏకంగా రూ.1,77,244 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైనే పడింది. మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు.
‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాషా’లోని ఓ ఫేమస్ డైలాగ్. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు షాకింగ్ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది.
హింస, విధ్వంసం, అరాచకం గురించి వైఎస్ జగన్ మాట్లాడితే రోత పుడుతోందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ నిర్వీర్యమైంది.