Home » IT Raids
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
నార్సింగ్లోని కేఎల్ఆర్ నివాసంలో నేడు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి 1గంట వరకూ ఐటీ బృందం సోదాలు జరిపించింది. ఇంట్లో లభ్యం అయిన డాక్యుమెంట్స్ని అధికారులు తీసుకెళ్లారు.
బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఐటీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐదు గంటలుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రొద్దుటూరు బంగారు షాపుల్లో గత 3 రోజులుగా ఐటీ అధికారుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.
భాగ్యనగరంలో మరోసారి ఐటీ సోదాల కలకలం రేగింది. శనివారం ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. ఏఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేష్రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదాయం పన్ను శాఖ కర్ణాటక లోని ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డవలపర్ల కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పట్టుబడిన రూ.94 కోట్లు బీజేపీవేనని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.జేపీ నడ్డా సారథ్యంలో బీజేపీ 'అవినీతికి ఫౌండేషన్' అని డీకే అభివర్ణించారు.
కర్నాటక: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. 20 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. మట్టికెరె, బీఎల్ సర్కిల్, ఆర్ఎంవీఎక్స్ స్టేషన్, మల్లేశ్వరం సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో మూడవ రోజు ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చిట్ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. అమీర్పేట్, కూకట్పల్లి శంషాబాద్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో 100 టీమ్స్తో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలు టార్గెట్గా రైడ్స్ కొనసాగుతున్నాయి.