Home » ISRO
సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్1లోని రెండు పరికరాలు ఉగ్ర సూరీడు చిత్రాలను బంధించాయని ఇస్రో తెలిపింది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న ప్రయోగించింది.
నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్ కాస్మో్సకు చెందిన ప్రైవేటు రాకెట్ ‘అగ్నిబాణ్’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాణ్ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.
నానాటికీ ఆలయాలకు(Temples) వచ్చే యువత సంఖ్య తగ్గిపోతోందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్(Somanath) ఆవేదన వ్యక్తం చేశారు. తిరువనంతపురంలోని శ్రీ ఉదియనూర్ దేవీ ఆలయంలో ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నయ్యర్ చేతుల మీదుగా ఆయన శనివారం ఓ అవార్డు అందుకున్నారు.
తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం(Kulasekhara town)లో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్కు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. ఇస్రో తయారు చేసిన ‘రీయూజబుల్ లాంచ్ వెహికల్’ ప్రయోగం నేడు మంచి సక్సెస్ సాధించింది. నేటి (శుక్రవారం) ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. గాల్లోకి ఎగిరిన అనంతరం ఈ రాకెట్ సురక్షితంగా రన్వేపై ల్యాండ్ అయింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation-ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1) లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
అంతరిక్షంలో భారత్ తొలి స్పేస్ స్టేషన్ను రానున్న కొన్నేళ్లలో అందుబాటులోకి రానుందని ఇస్రో(ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. రాబోయే రోజుల్లో స్టేషన్లోని మొదటి మాడ్యూల్స్ను ప్రయోగించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
తమిళనాడులోని తూత్కుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. అయితే, అనూహ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన 'ఇస్రో' యాడ్ తీవ్ర దుమారం రేపింది. ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు డీఎంకేను తప్పుపట్టగా, తూత్తుకుడి ఎంపీ కనిమొళి డీఎంకేను సమర్ధించారు.