Home » Israeli-Hamas Conflict
పాలస్తీనా గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో యుద్ధంలో మరణ మృదంగం మార్మోగుతోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రతీకార దాడి ఒకటి అమెరికాలో కలకలం సృష్టించింది. ముస్లిం మతానికి చెందిన ఆరేళ్ల బాలుడు, అతని 32 ఏళ్ల తల్లిపై ఓ భూస్వామి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు వైపుల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
హమాస్ అంతమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనియన్లు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటూ హెచ్చరించింది. 3 గంటల్లో ఇళ్లు విడిచి వెళ్లిపోవాల్సిందింగా హెచ్చరించింది. ఇప్పటికే 30 వేలకు పైగా సైనికులను గాజా సరిహద్దు వెంట మోహరించిన ఇజ్రాయెల్ ఏ క్షణమైన ఆ ప్రాంతంపై మెరుపుదాడికి దిగే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఆసదుద్దీన్ ఒవైసీ సూటిగా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును దెయ్యంగా, నిరంకుశుడిగా ఆయన అభివర్ణించారు. మీడియా పక్షపాత వైఖరితో కథనాలు ఇస్తోందన్నారు.
ఇజ్రాయెల్ పై ఆకస్మిక మెరుపు దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు వేల సంఖ్యలో ఇజ్రాయెలియన్లను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం పాలస్తీనా(Palestine - Israel)పై మెరుపు దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ పై హమాస్(Hamas) మిలిటెంట్ల దాడులను ముందే పసిగట్టారా? అంటే అవుననే సమాధానమిస్తోంది అమెరికా. అమెరికా(America)కు చెందిన గూఢచార సంస్థ రెండు రిపోర్టులు తయారు చేసింది. వాటి సారాంశం మాత్రం ఒక్కటే.. ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు జరగబోతున్నాయని. ఇందుకు సంబంధించిన వివరాలను అగ్రరాజ్యం తాజాగా బయటపెట్టింది.
ఇజ్రాయెల్(Israel) లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన టెల్ అవివ్ కు అక్టోబర్ 14 వరకు విమానాల(Flights) రాకపోకల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా తాజాగా రద్దు తేదీని పొడగించింది.
ఇజ్రాయెల్-పాలస్థీనా(Israeil-Palestine) యుద్ధంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ కి చెందిన చిన్నారులను బంధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సాయుధులు టెలిగ్రామ్(Telegram) యాప్ లో రిలీజ్ చేశారు. అయితే తాము పిల్లల్ని బాగా చూసుకుంటున్నామనే మెసేజ్ ఇచ్చేలా ఈ వీడియో ఉంది.