Home » Israel
టెహ్రాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది యుద్ధమా? ప్రళయమా? అంటూ జనాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.
ఇరాన్లోని శుద్ధి చేసిన యూరేనియంను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపడంపై అమెరికా, ఇజ్రాయెల్లు చర్చిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇరాన్ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్ కోసం మరిన్ని సర్ప్రైజ్లు ఎదురు చూస్తున్నాయని అన్నారు. అక్కడి నిరంకుశ పాలన అంతమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్ తొలి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లి అలీ ఖమేనీ మృతి తీవ్ర సంచలనమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కొడుకుల్లో ఒకరు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారులు నలుగురు క్షేమంగా ఉన్నారు.
ఇరాన్ తన శత్రుదేశం అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. జోర్డాన్లోని అత్యంత ఖరీదైన రాడార్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్మెంట్ ధ్వంసం అయింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ బ్లూ స్పారో క్షిపణితో టార్గెట్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతరిక్ష నుంచి విరుచుకుపడే క్షిపణిగా బ్లూ స్పారోను ఇజ్రాయెల్ వర్గాలు పిలుస్తాయట.
మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిస్సైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిస్సైల్స్ క్యారీయింగ్ క్లస్టర్ మూనిషన్స్ను రంగంలోకి దించింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ బుధవారం నాడు భీకరంగా విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన యాక్-130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ ఎఫ్-35 యుద్ధవిమానం కూల్చేసింది.
మధ్యఆసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే వైపు దూసుకువెళ్తున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బుధవారం నాడు ధ్వంసం చేసింది.