Home » IPL
సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ హైదరాబాద్లోని కర్మన్ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించాడు. శనివారం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశాడు. అతడికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిషేక్ శర్మ.. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
ఆర్సీబీ స్టార్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్న భువీ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని కోరాడు. అతడికి మరొక అవకాశం కల్పించి టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. మరి ధోని, రోహిత్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నారా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. ఆయా జట్ల కోచ్లు ఈ విషయంపై స్పందించారు.
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేశాక ఢిల్లీ బౌలర్ జేమీసన్ అతిగా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. చప్పట్లు చరుస్తూ అతడికేసి చూసి సెండాఫ్ ఇవ్వడంతో జేమీసన్పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేమీసన్ అతి సంబరాలపై స్పందించిన బీసీసీఐ అతడికి షాకిచ్చింది.
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఢిల్లీకి 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఆ జట్టు ప్లేయర్ శివం మావి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ ఆల్రౌండర్ ఆర్ఎస్ అంబరీష్ను తీసుకుంది. ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.
సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఓ కీలక మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మరొక్క సిక్స్ బాదితే టీ20 క్రికెట్లో వంద సిక్సర్ల జాబితాలోకి చేరిపోతాడు. వైభవ్ ఈ ఘనత సాధిస్తే.. ప్రపంచంలోనే ఈ ఫీట్ అందుకున్న తొలి టీనేజర్గా చరిత్ర సృష్టిస్తాడు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్లు సెహ్వాగ్, మురళీ కార్తిక్ స్పందించారు.