Home » India vs West indies
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. బ్యాటర్గా టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో నిలిచాడు. ఈ క్రమంలో టెస్టులు, వన్డేల్లో టాప్ 10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాటర్గా హిట్మ్యాన్ నిలిచాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాటింగ్ రాంకింగ్స్, టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 20 నుంచి జరగనుంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన ట్రినిడాడ్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికైనా క్వీన్స్ పార్క్లో గత రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ పిచ్పై భారత జట్టు గతంలో ఆడిన మ్యాచ్ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
మొదటి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన రెండో టెస్ట్ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్ భారత్కే దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రెండో టెస్ట్కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై ఏడాది కాలం కావొస్తుంది. అయితే బుమ్రా గాయం నుంచి దాదాపుగా కొలుకున్నాడని త్వరలోనే జట్టులోకి వస్తాడని ఈ మధ్య పలు జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై స్వయాన బుమ్రానే స్పందించాడు.
టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
వెస్టిండీస్ బోర్డు ఆర్ధిక నష్టాల్లో ఉండటంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఇచ్చే ప్రైజ్ మనీ 500 డాలర్లు మాత్రమే ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు షెడ్యూల్ బిజీగా ఉన్నా వెస్టిండీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడేందుకు అక్కడి క్రికెట్ బోర్డుకు ఆర్ధికంగా చేయూత అందించడానికే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు కూడా నోరుమెదపడం లేదని.. కానీ టీమిండియా అభిమానులు మాత్రం మీమ్స్ రూపంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుపై సెటైర్లు వేస్తున్నారు.
డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా గెలిచిన అత్యధిక మ్యాచ్ల్లో జట్టులో సభ్యుడిగా ఉన్న రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఈ నెల 20 నుంచి భారత్, వెస్టిండీస్(West Indies vs India 2nd Test) మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్తో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించనున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 499 మ్యాచ్లు ఆడాడు. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్తో తన కెరీర్లో 500 మ్యాచ్లను పూర్తి చేసుకున్నాడు.
అరంగేట్రంలోనే భారీ సెంచరీతో దుమ్ములేపిన టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన కుటుంబానికి అదిరిపోయే బహుమతిని ఇచ్చాడు. తన కుటుంబం కోసం ఏకంగా 5 బెడ్రూంల ఇంటిని కొన్నాడు. ఇటీవల అతని కుటుంబం డబుల్ బెడ్రూం ఇంటి నుంచి 5 బెడ్రూంల ఇంటికి మారింది.
మొదటి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల (India won by an innings and 141 runs) భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఆసియా వెలుపల టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం.