Home » India vs West indies
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు అతిథ్య జట్టుతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో భారత యువ ఆటగాళ్లను శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ను మిస్ వరల్డ్ ట్రినిడాడ్ & టొబాగో ఆచే అబ్రహామ్స్ కలుసుకుంది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ను కలుసుకున్న ఆమె వారితో ప్రత్యేకంగా ముచ్చటించింది.
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కుర్రాళ్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ కుర్రాళ్లు తొలుత బ్యాటింగ్ చేయనున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఓడిపోలేదు. లీగ్ స్టేజీలో పాకిస్థాన్ను చిత్తు చేసింది. సెమీస్లో బంగ్లాదేశ్ను కూడా ఓడించింది. ఇప్పుడు ఫైనల్లో కూడా మరోసారి పాకిస్థాన్ను ఓడించి టైటిల్ విజేతగా నిలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు టీమిండియా కెప్టెన్గా ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఐర్లాండ్లో పర్యటించే భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్నే కెప్టెన్గా నియమించనున్నారని సమాచారం. నిజానికి గత టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్లో భారత జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు.
భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం ఆటంకిగా మారింది. మూడో రోజు ఆటలో మొదటి సెషన్ మధ్యలోనే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం ఆగుతుందేమో అని కాసేపు ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకపోయింది.
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నపెద్ద అనే తేడా లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అంతటా కోహ్లీ అభిమానులు ఉంటారు.
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్తో (West Indies vs India 2nd Test) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్లను (500 Matches) పూర్తి చేసుకున్నాడు. దీంతో 500 మ్యాచ్ల క్లబ్లో చేరిన 4వ భారత క్రికెటర్గా.. మొత్తంగా 10వ ఆటగాడిగా నిలిచాడు.
భారత్తో రెండో టెస్ట్ మ్యాచ్లో అతిథ్య జట్టు వెస్టిండీస్ టాస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బౌలింగ్ యూనిట్లో పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముఖేష్ కుమార్ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో ముఖేష్ కుమార్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేంట్రం చేశాడు.
మరికాసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విధాల బలంగా ఉంది. స్థాయి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు పెదగా కష్టం కాకపోవచ్చు.
గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్తో భారత్, వెస్టిండీస్ (West Indies vs India) జట్ల మధ్య 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. అంటే సెంచరీ పూర్తి కానుంది.