Home » IMD
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం నుండే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం పశ్చిమ దిశగా పయనించి బలపడిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్ తెలిపారు. అయితే గత 24 గంటలుగా అక్కడే స్థిరంగా ఉన్న అల్పపీడనం ప్రస్తుతం తీరం వైపు పయనిస్తోందన్నారు.
దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి తోడు అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఏ ప్రాంతాల్లో వానలు పడే ఛాన్స్ ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది శనివారం ఉదయం పుదుచ్చేరి (కారైక్కాల్) - మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ చెన్నై(Chennai) ప్రాంతీయ కేంద్రం అంచనా వేసింది.
శ్రీలంక- తమిళనాడు మధ్య ఏర్పాడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్గా బలపడే అవకాశముంది. ఇది ఉత్తర తమిళనాడు, మహాబలిపురం మధ్య నవంబర్ మాసాంతంలో తీరం దాటే అవకాశముంది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ‘ఫెంగల్’ అనే ఈ తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ పరిశోధన మండలి హెచ్చరించడంతో ఆరు జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 25వ తేదీనాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో డెల్టా, కోస్తాతీర జిల్లాల సహా పుదుచ్చేరి, కారైక్కాల్(Puducherry, Karaikal) ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింతగా బలపడుతున్నాయి. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియా సముద్రంపై బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ 21 జిల్లాలకు హెచ్చరిక చేసింది.