Home » Illegal Constructions
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. వాటికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పీపీపీ కింద మూసీ ప్రాజెక్ట్ చేపడతామని ప్రకటించారు. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకువస్తామని అన్నారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అని మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ వివాదంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని ఆదేశించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
రాబోయే రోజుల్లో రూ. 5500 కోట్లతో మూసీకి గోదావరి నీరు తెచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని వాస్తవ విమర్శ చేయాలని అన్నారు..లేకపోతే పర్యవసానం తప్పదని హెచ్చరించారు. బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు తాన అంటే తందాన అంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేస్తోంది.
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. పటాన్చెరు పరిధి కిష్టారెడ్డిపేట, పటేల్గూడ గ్రామాలలో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా 20 గంటలపాటు కొనసాగాయి!
బీఆర్ఎస్ నేత ఒకరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అసైన్డ్ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు గురువారం కూల్చివేశారు.
చెరువుల సంరక్షణ సంగతి దేవుడెరుగు.. అవి అన్యాక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి!