Home » IIT
దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.
చదువు కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటీలో చేరేందుకు ఆ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసింది.
అత్యున్నత సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ద్వారా దేశాభివృద్ధిలో ఐఐటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.
ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఐఐటీ మద్రాస్ నుండి పీహెచ్డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వంతో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, యువత నిరుద్యోగంతో అల్లాడుతోందని విమర్శించారు.
తమ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా ఐఐటీయన్లను నియమించకున్నామని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య దూరాన్ని తగ్గించడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్లో ఏఆర్-వీఆర్ ల్యాబ్ ఏర్పాటైంది.
యోగాసనాలు వేసేటప్పుడు సూచనలు ఇవ్వడంతో పాటు భంగిమల్లో ఏర్పడే పొరపాట్లను సరిదిద్దేందుకు ఐఐటీ మండీ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత యోగా మ్యాట్ను రూపొందించారు.
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తక్కువ కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెనను ఐఐటీ-హెచ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హెచ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రమణ్యం తన బృందంతో దీన్ని క్యాంపస్ ప్రాంగణంలో నిర్మించారు.