Home » IAS
ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు చీవాట్లు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వ ''ఉచితాల సంస్కృతి''ని తప్పుపట్టింది.
ఈనెల 27న రాజేందర్ నగర్ రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరదనీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అదనపు కమిషనర్ తారిక్ థామస్ స్పందించారు. అభ్యర్థుల మృతికి తమ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. మా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఐఏఎస్ కోటింగ్ సెంటర్లోని సెల్లార్ను వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థుల మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో లోక్సభ ఎంపీ పప్పు యాదవ్ మంగళవారంనాడు కీలక వ్యాఖ్య చేశారు. కోచింగ్ సెంటర్లోని 10 నుంచి 12 మంది విద్యార్థుల జాడ ఇప్పటికీ తెలియకుండా ఉందని అన్నారు.
రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమిపై అవినాశ్ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ‘
వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజ కేడ్కర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేంద్రం నియమించిన ఏక సభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన నివేదకను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కి సమర్పించింది.
వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, ఇది 'హత్యే'గానే తాను భావిస్తున్నాని అన్నారు.
సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్ను ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు.
సివిల్ సర్వీస్లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్(IAS officer Smithasabarwal) ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
ఐపీఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల "వైవాహిక స్థితి''పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.
రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(IAS officer Smita Sabharwal) మాటలు దేశంలోని దివ్యాంగుల మనోభావాలు, ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ కళాకారిణి డాక్టర్ పద్మావతి(Dr. Padmavathi) డిమాండ్ చేశారు.